ఎన్నికల్లో గెలుపు కోసం వైసిపి ప్రయత్నాలు చేస్తుంది. సర్వేలు నిర్వహించి మరి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. ఇంచార్జ్ ల మార్పు చేసి గెలుపు కోసం అధికార వైసిపి ప్రయత్నాలు చేస్తోంది. గెలుపు కోసం వైసిపి చేస్తున్న ప్రయత్నాలన్నీ పార్టీకి గెలుపును ఇవ్వకపోగా ఓటమిని కొనితెచ్చుకుంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం ఇంచార్జిగా దద్దాల నారాయణ యాదవ్ ను నియమించారు. గతంలో కనిగిరి నియోజకవర్గం నుంచి బుర్ర మధుసూదన్ యాదవ్ వైసీపీ తరఫున విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైసిపి తరఫున పోటీ చేసి ఓటమి పొందారు, కానీ 2019లో విజయం సాధించారు. ఈసారి కనిగిరి నుంచి అభ్యర్థి మార్పు ఉండదు అని అందరూ అనుకున్నా అనూహ్యంగా మధుసూదన్ యాదవ్ పై వ్యతిరేకత ఉండడంతో అభ్యర్థిని మార్చాల్సి వచ్చిందని వైసిపి చెబుతోంది. కానీ బుర్రా మధుసూదన్ యాదవ్ అనుకూల వర్గం మాత్రం దద్దాల నారాయణ యాదవ్ ను నియమించటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మధుసూదన్ యాదవ్ కు టికెట్ ఇవ్వకపోతే వైసీపీని ఓడించి తీరతామని వైసిపి నేతలే చెబుతుండడంతో వైసిపి నాయకులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఇంచార్జి మార్పుతో విజయం సాధించాలని కోరుకుంటున్న వైసీపీకి సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి ఎదురవుతుండడంతో ఎటు పాలు పోనీ స్థితిలో వైసిపి ఉంది. నియోజకవర్గంలో వైసిపి పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకత ఉంటే వైసీపీ గెలుపు కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరి ఎన్నికలవేళ వైసీపీకి ఇంచార్జి ల మార్పు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వనుందో???
ReplyReply allForwardAdd reaction |