ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలో తలమును కలయ్యాయి. కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో అభ్యర్థులను ఎన్నిక చేస్తున్నారని చెప్పవచ్చు. టిడిపి ఆశావహుల కోసం తాజాగా శ్రీకాకుళం నుంచి టిడిపి అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయింది.
ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ టికెట్ ఇచ్చారు. అతనికి మంచి పట్టు ఉంది. ఈసారి కచ్చితంగా గెలిచి తీరతాడని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. పలాస నుండి గౌతు శిరీష, టెక్కలి నుంచి అచ్చన్న నాయుడుకే టికెట్ ఇచ్చారు. ఆముదాలవలస కోన రవికుమార్ పేరుని ఖరారు చేసినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాజాం నుండి కొండ్రు మురళికి టికెట్ ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి లక్ష్మీదేవిని ఎంపిక చేశారని తెలుస్తోంది. పాలకొండ నియోజకవర్గం లో ఇంకా గెలిచే అభ్యర్థి కోసం టీడీపీ శ్రేణులు అన్వేషణలో ఉన్నట్లు చెబుతున్నారు. ఎచ్చర్ల నుంచి కళా వెంకట్రావుకి టికెట్ను నిర్ణయించినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ నియోజకవర్గం నుంచి కలిశెట్టి అప్పలనాయుడు కూడా టికెట్ ను ఆశిస్తున్నారు. కానీ అప్పలనాయుడు కు వేరే ఏదైనా పదవి ఇవ్వవచ్చని, అధికారంలోకి రావటమే తమ లక్ష్యం కాబట్టి ఈసారి కళా వెంకట్రావు పేరుని నిర్ణయించినట్లు టిడిపి నేతలు చెబుతున్నారు. పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు పేర్లు పరిశీలనలో ఉన్నా, మామిడి గోవిందరావుకి ఈసారి టికెట్ ను ఇచ్చారు అని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మామిడి గోవిందరావుకు పాతపట్నంలో మంచి పట్టు ఉంది ఈ నియోజకవర్గంలో కలమట వెంకటరమణతో కలిసి పనిచేస్తే భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బొగ్గు శ్రీనివాసరావు పేరును కూడా పరిశీలించారు కానీ శ్రీనివాసరావుకు నియోజకవర్గంలో పేరుంది, అంతేకాకుండా ఆర్థికంగా బలమైన నేత ఒకానొక సమయంలో శ్రీనివాసరావుకే టికెట్ ఇస్తారని వార్తలు వినిపించినా శ్రీనివాసరావుకు క్యాడర్ ను పట్టించుకునే తత్వం లేకపోవడంతో శ్రీనివాసరావు పేరును పక్కన పెట్టినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
మరి తాజాగా విడుదలైన ఈ జాబితాలో అభ్యర్థులు ఎంతవరకు విజయం సాధిస్తారో??? టిడిపికి గెలుపును అందించే వారెవరో??? వేచి చూడాల్సిందే!!!