గత ఎన్నికల్లో టిడిపి 23 ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే గెలిచింది. వైసీపీ 151 స్థానాలు సాధించి అధికారాన్ని చేపట్టింది. ఇప్పుడు వైసిపి వైనాట్ 175 అంటూ ప్రజల ముందుకు వెళుతుంటే, టిడిపి మాత్రం ఈసారి అధికారం చేపట్టేది తామేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గతంలో టిడిపి గెలిచిన 23 స్థానాలలో ఒకటి రెండు సీట్లు వదిలినా మిగతా 21 సీట్లు ఈసారి టిడిపి ఖచ్చితంగా గెలిచే స్థానాలు. టిడిపి జనసేన పొత్తులో భాగంగా కూటమి ఖచ్చితంగా 33 సీట్లు గెలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇవి మొత్తం 54 సీట్లు ఏ పార్టీ అయినా అధికారం చేపట్టడానికి కావలసిన స్థానాలు 88 వీటిలో ఇంకా కావలసినవి 34 స్థానాలు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టిడిపికి అనుకూల పవనాలే వీస్తున్నాయి. అధికార పార్టీపై వ్యతిరేకత ఉంది, అంతేకాకుండా వైసిపి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వైసీపీకి అనుకూలంగా ఉన్న ఒక్కొక్క వర్గము బయటకు వెళ్ళిపోతుంది. అందులో ముఖ్యమైనది వైసిపి గ్రూపు తగాదాలు. అంతేకాకుండా నిరుద్యోగ యువత కూడా వైసిపికి దూరమయ్యారని చెప్పవచ్చు. ఉద్యోగులు, టాక్స్ పేయర్స్ అందరూ వైసీపీకి దూరం అవడం వల్ల టీడీపీ గెలిచి అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ టిడిపి గెలిచే అవకాశాలు ఉన్నాయని వైసిపి పెద్దలకు, ఐపాక్ కి అందరికీ తెలుసు కానీ వాటిని అడ్డుకోవడానికి వైసిపి అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ప్రత్యేక వ్యూహాలను కూడా పాటిస్తోంది. కచ్చితంగా గెలిచే సీట్లలో టిడిపి టికెట్ ఇచ్చిన అభ్యర్థికి వ్యతిరేక వర్గానికి సీటు ఇవ్వడం వంటి వాటితో వైసిపి టిడిపికి చెక్ పెట్టాలని వ్యూహరచన చేస్తోంది.
వైసిపి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి కూటమి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ReplyReply allForwardAdd reaction |