అవును … ఎన్నికలకు మరో 100 నుంచి 120 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో దాదాపు 30 నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. అసలు అక్కడ బలమైన, గెలుపు గుర్రాల వంటి అభ్యర్థులు కూడా లేకపోవడం.. పార్టీని ఇబ్బందికి గురిచేస్తోందనే టాక్ అంతర్గతం గా వినిపిస్తోంది. దీంతో ఈ సెగ్మెంట్ల పరిస్థితి ఏంటి? అనేది వైసీపీ టాక్. 2019 ఎన్నికల్లో 151 నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీ విజయం దక్కించుకుంది.
ఇది భారీ సంఖ్యే అయినప్పటికీ.. తాము అనుసరిస్తున్న విధానాలు.. ప్రవేశ పెడుతున్న పథకాలతో వచ్చే ఎన్నికల్లో 175 కు 175 నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకోవాలన్నది.. వైసీపీ అధినేత వ్యూహం. ఇలా చూసుకుంటే.. కీలకమైన 30 నియోజకవర్గాల్లో (వీటిలో కొన్ని గెలిచినవి కూడా ఉన్నాయి) బలమైన అభ్యర్థులు కనిపించడం లేదు. ఉన్నవారిపైనే ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. కొన్ని చోట్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వస్తున్నాయి.
ఇక, టీడీపీ బలంగా ఉండి.. గత ఎన్నికల్లో పరాజయం పాలైన నియోజకవర్గాల్లో(ఇవి 50 దాకా ఉన్నాయని లెక్క) వైసీపీ నాయకులు బలహీన పడ్డారనే టాక్ ఉంది. ఉదాహరణకు సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, తాడికొండ(వైసీపీ తరఫున గెలిచిన శ్రీదేవి పార్టీ మారారు), గిద్దలూరు(వైసీపీ అభ్యర్థి పార్టీమారే ఆలోచన) ప్రత్తిపాడు(గెలిచినా.. సత్తా లేదు), పిఠాపురం, నంద్యాల, పత్తికొండ, విజయవాడ వెస్ట్, సెంట్రల్ వంటి 50 నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురు గాలులు వీస్తున్నాయని లెక్కలు వేశారు.
ఇక, అద్దంకి, పరుచూరు, టెక్కలి, ఉండి, కుప్పం, తిరుపతి(వైసీపీ) తదితర సెగ్మెంట్లలోనూ గెలిచి తీరడం కష్టసాధ్యమేననే వాదన వినిపిస్తోంది. దీంతో ఆయా సెగ్మెంట్ల వైజ్గా జాబితాను తెప్పించుకున్న అధిష్టానం వాటిలో మార్పులకు శ్రీకారం చుట్టాలా? లేక, ఏం చేయాలి? అనే విషయం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. వచ్చే మూడు నెలల్లో ఈ నియోజకవర్గాల్లో భారీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
ReplyReply allForward |