విశాఖలో తమ పట్టు సాధించాలని వైసిపి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.అలాంటి విశాఖలోనే సౌత్ నియోజకవర్గం లో కార్యకర్తలకు ఎమ్మెల్యేలకు మధ్య ఉప్పు నిప్పుగా ఉందని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపి నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చారు. అప్పటికీ వైసీపీలో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతం రాజు సుధాకర్ వైసీపీ అభ్యర్థిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
కార్పొరేటర్లకు వాసుపల్లి గణేష్ కుమార్ కు మధ్య మొదటి నుంచి సఖ్యత లేదు.వాసుపల్లి వైసీపీలోకి రావడం కార్పొరేటర్లలో ఎవరికి ఇష్టం లేదు.వీరంతా సీతం రాజు సుధాకర్ వైపే చూస్తున్నారు.సుధాకర్ తో మాత్రమే సన్నిహితంగా ఉంటున్నారు.ఇలా ఉండడంతో కార్పొరేటర్లకు ఎమ్మెల్యే వాసుపల్లికి మధ్య తరచూ విభేదాలు వస్తూ ఉన్నాయి.మహమ్మద్ సాదిక్, ఊరుకూటి నారాయణరావు,చిన్న జానకిరామ్ వీరందరూ వాసుపల్లి తో వ్యతిరేకంగానే ఉన్నారు.సుధాకర్ వర్గాన్ని వాసుపల్లి వర్గాన్ని ఎకం చేయడానికి ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి ప్రయత్నాలు విఫలమవడంతో,స్వయంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి వాసుపల్లికి సుధాకర్ వర్గానికి మధ్య సయోధ్య కుదుర్చారు.సీఎం ఎదురుగా ఇరు వర్గాలు కలిసిపోయామని,ఇద్దరు కలిసే పని చేస్తామని చెప్పారు.
వాసుపల్లికి వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో చాలా చోట్ల పోస్టర్లు అంటించి మరీ తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి.పార్టీ మారడం వాసుపల్లికి అలవాటని,పదవులు అమ్ముకుంటారని బహిరంగంగానే కార్పొరేటర్లందరూ విమర్శిస్తున్నారు.
ఈ గొడవ ఇలాగే కొనసాగితే విశాఖ సౌత్ లో వైసీపీకి స్థానం లేనట్లే…