పరిపాలన రాజధానిగా విశాఖను వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రిషికొండలో అధికారిక కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అక్కడికి రాజధాని మార్పు ఇంకా జరగలేదని చెప్పవచ్చు. అటువంటి విశాఖ లో వైసీపీ గురించి ప్రజలేమనుకుంటున్నారో? అక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీ విజయం సాధించే నియోజకవర్గాలు ఎన్నో చూద్దామా..
విశాఖ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. భీమిలి, శృంగవరపుకోట, గాజువాక, విశాఖ తూర్పు, విశాఖ వెస్ట్, విశాఖ సౌత్, విశాఖ నార్త్ వీటిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ టిడిపి జనసేన కూటమితో హోరాహోరీ పోరులో వైసిపి ఒక నియోజకవర్గాన్ని మాత్రమే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భీమిలి నుంచి టిడిపి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి ముత్తం శెట్టి శ్రీనివాసరావే ఈసారి కూడా పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ముత్తంశెట్టిపై నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత టిడిపికి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శృంగవరపుకోట నుంచి టిడిపి అభ్యర్థిగా గోళ్ళ లలిత కుమారి, గంప కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. వీరి ఇరువురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా కూటమి అభ్యర్థి గెలుపే ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శృంగవరపుకోట వైసీపీలో వర్గ పోరు నియోజకవర్గ ప్రజలలో అసమ్మతి వలన ఈసారి వైసిపికి ఎదురుగాలి తప్పదని తెలుస్తోంది. గాజువాక ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసరావు బరిలో ఉన్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మాత్రమే ఈ నియోజకవర్గం నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గాజువాక నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు ఇప్పటివరకు బలమైన నేత అయితే కనిపించలేదు అన్నది వైసిపి నేతల మాట. విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎంపీ ఎంవివి సత్యనారాయణ ను బరిలో దించేందుకు వైసిపి నిర్ణయించింది. కానీ ఎంవివి సత్యనారాయణ పై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో, వెలగపూడి రామకృష్ణ కి నియోజకవర్గ ప్రజలు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. వెలగపూడి రామకృష్ణ మాస్ లీడర్ గా, మత్స్యకార కుటుంబాల ఓట్లన్నీ ఇతనికే అని టిడిపి జనసేన కూటమి నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. విశాఖ వెస్ట్ ఈ నియోజకవర్గం నుంచి గణబాబు టిడిపి తరఫున వరిలో ఉన్నారు. ఈసారి కూడా విజయం సాధించేందుకు కావలసిన ఏర్పాట్లలో ఉన్నారని చెప్పవచ్చు. విశాఖ సౌత్ ఈ నియోజక వర్గం నుంచి టిడిపి అభ్యర్థి ఎవరో ఇంకా నిర్ణయించలేదు. ఈ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుందని, ఆ పోరులో టిడిపి నే గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశాఖ నార్త్ ఈ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున విష్ణుకుమార్ రాజు టిక్కెట్ ఆశిస్తున్నారు. వైసిపి తరఫున కేకే రాజు బరిలో ఉన్నారు. వీరివురి మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
పరిపాలనా రాజధాని అంటూ వేలకోట్లు ఖర్చుపెట్టినా విశాఖ ప్రజలే వైసిపి వైపు చూడడం లేదంటే రాష్ట్రంలో మిగిలిన జిల్లాల పరిస్థితి ఏమిటో???